
విజయవాడ నగర శివారులో కాల్పుల కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి ఓ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్గా గుర్తించారు. ఈ ఘటన విజయవాడ శివారు బైపాస్రోడ్డులోని బార్ సమీపంలో జరిగింది. నిందితులు ప్లాన్ ప్రకారమే మహేష్ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ఘటనా స్థలాన్ని సీపీ బత్తిన శ్రీనివాసులు అర్ధరాత్రి పరిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. అయితే కాల్పులకు రియల్ ఎస్టేట్ వివాదం కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్కూటీపై వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు చెప్పారు. కాల్పులు జరిగే సమయంలో మృతుడు మహేష్ తో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.