పేరెంట్స్‌‌‌‌ను పట్టించుకోకుంటే 3 నెలలు జైలు

పేరెంట్స్‌‌‌‌ను పట్టించుకోకుంటే 3 నెలలు జైలు

అచ్చంపేట, వెలుగు:  పేరెంట్స్‌‌ సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూ వారిని పట్టించుకోకుంటే మూడు నెలల జైలు శిక్ష ఉంటుందని అచ్చంపేట జూనియర్​ సివిల్​జడ్జి చైతన్య హెచ్చరించారు.   ఆజాదీకా అమృత్​ మహోత్సవాల్లో శనివారం అచ్చంపేట మండలం చందాపూర్​ హాజీపూర్​ , చెన్నారం గ్రామాలలో న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి చైతన్య  మాట్లాడుతూ సీనియర్​ సిటిజన్స్​ యాక్ట్​ ప్రకారం తల్లి దండ్రులను పట్టించుకోక పోతే జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుందన్నారు. అంతేకాదు  ఆస్తిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ చట్టం ప్రకారం అసంబద్ధమైన మేసేజ్‌‌లు ఫార్వర్డ్​ చేసే వారిపై  కేసులు నమోదు చేసి జైలు పంపవచ్చన్నారు.  ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్​ రాజేందర్​, శ్రీధర్​ రావు, వెంకట్​ షెట్టి, సుదాకర్  పాల్గొన్నారు.