
షోపియాన్: కశ్మీర్లో కార్మికుల్ని చంపిన టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పోలీసులతో కలసి భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్లోని ద్రగడ్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో సెక్యూరిటీ ఫోర్సెస్ జాయింట్ టీమ్ అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించింది. దీంతో భద్రతా దళాలపై టెర్రరిస్టులు కాల్పులకు దిగడంతో.. జవాన్లు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు. వీరిలో ఒకర్ని అదిల్ వనీగా గుర్తించారు. రీసెంట్గా పుల్వామాలో ఓ కార్మికుడ్ని చంపిన ఘటనలో వనీ పాత్ర కీలకమని తేలింది.