కార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ

కార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ

షోపియాన్: కశ్మీర్‌లో కార్మికుల్ని చంపిన టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పోలీసులతో కలసి భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్‌లోని ద్రగడ్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో సెక్యూరిటీ ఫోర్సెస్ జాయింట్ టీమ్ అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించింది. దీంతో భద్రతా దళాలపై టెర్రరిస్టులు కాల్పులకు దిగడంతో.. జవాన్లు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు. వీరిలో ఒకర్ని అదిల్ వనీగా గుర్తించారు. రీసెంట్‌గా పుల్వామాలో ఓ కార్మికుడ్ని చంపిన ఘటనలో వనీ పాత్ర కీలకమని తేలింది.  

మరిన్ని వార్తల కోసం:

డ్రగ్స్ తీసుకునేవాళ్లు గోవాకు రావొద్దు: మనోహర్ అజ్గోంకర్

ఎక్కడ గెలవరో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు: బండి సంజయ్ 

లఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్