సామాజిక తనిఖీ ఇన్​హౌజ్ ​ప్రజావేదిక

సామాజిక తనిఖీ ఇన్​హౌజ్ ​ప్రజావేదిక

బీర్కూర్, వెలుగు : ఉపాధి హామీ పథకంలో భాగంగా 2023–-24 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించి 15వ విడత సామాజిక తనిఖీ ఇన్ హౌస్ ప్రజా వేదిక బీర్కూర్​ రైతు వేదికలో  శుక్రవారం నిర్వహించారు. గ్రామాల వారీగా సమాచారం చదివి వినిపించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్​ వామన్ రావు వచ్చిన అభియోగాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

 ఈ ప్రజావేదికలో జిల్లా విజిలెన్స్ అధికారి ప్రశాంత్ కుమార్​,  ఎంపీడీవో భాను ప్రకాశ్, ఎంపీవో మహబూబ్, ఏపీవో అక్మల్,  ఎస్​ఆర్​పీ మహేశ్, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డు అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది, సామాజిక తనిఖీ బృందం సభ్యులు పాల్గొన్నారు.