
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని పక్కా సమాచారంతో అధికారులు తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ లైట్లో బంగారాన్ని దాచి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ప్రయాణికుడి నుంచి దాదాపు రూ.1.82 కోట్ల విలువైన 2.915 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని.. అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.