ముగిసిన ట్రైనీ ఆఫీసర్ల స్టడీ టూర్

ముగిసిన ట్రైనీ ఆఫీసర్ల  స్టడీ టూర్

నిజామాబాద్, వెలుగు: సెంట్రల్​ మిలటరీ ఇంజినీరింగ్​ సర్వీసెస్​కు సెలెక్టయిన 30 మంది ట్రైనీ యువ ఆఫీసర్ల వారం రోజుల స్టడీ టూర్​ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్​ అంకిత్​తో సమావేశమైన ఆఫీసర్లు ఫీల్డ్​ విజిట్​లో గమనించిన అంశాలను ఆయనతో పంచుకున్నారు. డ్వాక్రా సంఘాల మహిళల్లో చైతన్యం స్ఫూర్తి నింపిందన్నారు. గ్రామీణ నేపథ్యంగల మహిళలు ఆర్థిక అంశాలలో కనబరుస్తున్న ప్రతిభ అద్భుతంగా ఉందన్నారు. 

స్కూల్స్​లో ఎండీఎం, అంగన్​వాడీ, ఆశా వర్కర్లు పల్లె ప్రజలకు అందిస్తున్న సేవలు విలువైనవిగా గుర్తించామన్నారు. ఉపాధి హామీ పనులు, వ్యవసాయ కూలీల జీవన విధానాన్ని కూడా అధ్యయనం చేశామన్నారు. స్టడీ టూర్​ మంచి అనుభూతిని కలిగించిందన్నారు.  వీడ్కోలు చెప్పి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. అదనపు కలెక్టర్​ (రెవెన్యూ) కిరణ్​కుమార్​, డీఆర్డీవో సాయాగౌడ్​ తదితరులు ఉన్నారు.