తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

 తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్​లోని శాసన మండలిలో ఏప్రిల్ 7న   ఏడుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. 

కాంగ్రెస్ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్యం ప్రమాణం చేశారు.   వీరితో పాటు పట్లభద్రుల,టీచర్ ఎమ్మెల్సీలు  అంజిరెడ్డి, కొమురయ్య, శ్రీపాల్ రెడ్డిలు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మరో రోజు  ప్రమాణం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, లక్ష్మీణ్ హాజరయ్యారు.