గచ్చిబౌలి, వెలుగు: బైక్హారన్ ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించిన వ్యక్తిపై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. రాయదుర్గం పోలీసుల వివరాల ప్రకారం.. మణికొండ పోచమ్మకాలనీకి చెందిన నాగార్జునరెడ్డి ఓ ప్రైవేట్కోచింగ్సెంటర్లో పనిచేస్తున్నాడు.
ఈ నెల 2న అర్ధరాత్రి తన ఇంటి ముందు సెల్ఫోన్మట్లాడుతుండగా, దాదాపు 9 మంది మూడు బైక్లపై హారన్కొట్టుకుంటూ వెళ్లారు. దీంతో హారన్ఎందుకు కొడుతున్నారని నాగార్జున్రెడ్డి వారిని ప్రశ్నించగా, అందరూ కలిసి అతడిపై దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవపడ్డ యువకులను అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి
తీసుకున్నారు.