యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‎లో ప్రమాదం.. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‎లో ప్రమాదం.. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. రోజువారి విధుల్లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్లాంట్‌లో బూడిద యంత్రాన్ని క్లీన్ చేస్తుండగా వేడి బూడిద కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాయపడ్డ కార్మికులను హైదరాబాద్‎కు తరలించారు. వేడి బూడిద మీద పడటంతో కార్మికులు చేసిన ఆర్తనాదాలతో ప్లాంట్ దద్దరిల్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులు ఎవరు..? అసలు ప్రమాదం ఎలా జరిగింది..? అనే దానిపై ప్లాంట్ అధికారులు ఆరా తీస్తున్నారు.