బెట్టింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు: -ఎస్పీ

బెట్టింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు: -ఎస్పీ

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: జిల్లాలో బెట్టింగ్​కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్​మహాజన్​హెచ్చరించారు. ఆదివారం పోలీస్​కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని రాంనగర్​లో బెట్టింగ్ కు పాల్పడుతున్న షేక్ రియాజ్, మహారాష్ట్ర కిన్వట్​కు చెందిన ఆరిఫ్, లడ్డూ చౌహాన్, పిట్టలవాడకు చెందిన గంథాడే సోహన్,  భుక్తాపూర్ ఖిల్లా ఏరియాకు చెందిన సుల్తాన్ పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

బెట్టింగ్ కు అలవాటుపడి యువత ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నారు. మోసగాళ్ల మోసపూరిత ప్రకటనలు చూసి ఆన్​లైన్ బెట్టింగులకు పాల్పడడం, గుర్తింపు లేని ఇంటర్​నెట్​సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహించే వారిపై పోలీసుల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.