
- మంగళ్హట్ పీఎస్లో నమోదు
మెహిదీపట్నం, వెలుగు: గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ధూల్పేట జాలి హనుమాన్ దేవాలయం సమీపంలో నుంచి శోభాయాత్ర కొనసాగుతుండగా, పోలీసులు, కార్యకర్తలకు మధ్య చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి రాజాసింగ్పై మంగళవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంతకు ముందే రాజాసింగ్ పై మంగళ్హట్ పీఎస్ లో కేసు నమోదైంది.
ఆదివారం మధ్యాహ్నం శ్రీరామనవమి శోభాయాత్రలో డీజే సౌండ్ పెట్టడం, పోలీసుల ఆదేశాలు పాటించకపోవడంతో ముగ్గురు ఆర్గనైజర్లపై పోలీసులు కేసు పెట్టారు. వీరిలో భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భవంత్రావు, శ్రీరామనవమి పల్లకి సేవా శోభాయాత్ర నిర్వాహకుడు ఆనంద్సింగ్ లోథ్తోపాటు రాజాసింగ్కూడా ఉన్నారు.