హవాలా డబ్బు అంటూ రూ.25 లక్షల దోపిడీ

హవాలా డబ్బు అంటూ రూ.25 లక్షల దోపిడీ
  • నిందితుల్లో సైబరాబాద్​ సీపీ ఎస్కార్ట్ ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్​

చేవెళ్ల, వెలుగు: ఈజీ మనీ కోసం ఓ ఏఆర్​ కానిస్టేబుల్, మరో ఇద్దరితో కలిసి హవాలా డబ్బు పేరుతో కర్నాటకకు చెందిన వ్యక్తుల వద్ద రూ. 25 లక్షలు కొట్టేశారు. మొయినాబాద్ సీఐ పవన్​ కుమార్​రెడ్డి కథనం ప్రకారం.. యూపీకి చెందిన అజయ్ హైదరాబాద్​లో స్క్రాప్ బిజినెస్ ​చేస్తుంటాడు. సిటీకి చెందిన మొబిన్  తండ్రి నబీ గతంలో మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గూడలో ఫామ్ హౌస్ ఓనర్ జుబేర్ ​వద్ద డ్రైవర్ గా చేసి మానేశాడు. అతనికి అజయ్​తో పరిచయం ఉంది. ఇద్దరూ ఈజీగా మనీకి ప్లాన్ చేశారు.  గుల్బార్గాలో స్క్రాప్  బిజినెస్ ​చేసే ఇమ్రాన్​కు, హైదరాబాద్​లో స్క్రాప్ వ్యాపారి ఉమర్​కు గత  బుధవారం  కాల్​చేశారు.

 ఫామ్ హౌస్​లో షెడ్డు కూల్చి వేస్తున్నారని, స్క్రాప్ డంప్ ​చాలా ఉందని, కొంటే భారీ లాభం వస్తుందని చెప్పారు. రూ.25 లక్షలు తీసుకుని రావాలని నమ్మించారు.  మరో ఇద్దరు గ్రామస్తులైన రాంచందర్, మసూద్, బంధువైన ఇమ్రాన్​తో పాటు సైబరాబాద్ కమిషనరేట్​లో ఏఆర్ కానిస్టేబుల్​ సీపీ ఎస్కార్ట్  శేఖర్ సాయం అడిగారు. ఇద్దరూ ఫాంహౌస్​లోకి రాగానే హవాలా డబ్బులు అంటూ  లాక్కొని పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా  ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ ​దోపిడీలో ఉన్నాడని తేలడంతో అతడితో పాటు రాంచందర్​ను, మసూద్​ను అరెస్ట్ ​చేసి రిమాండుకు తరలించారు.