పెర్కిట్ లో కెనాల్​ భూమి సర్వే

 పెర్కిట్ లో కెనాల్​ భూమి సర్వే

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో నిజాంసాగర్​ కెనాల్​ భూమి హద్దు సర్వేను మంగళవారం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ పరిశీలించారు. కెనాల్​ భూమి కబ్జా జరుగుతుందన్న ఫిర్యాదుల మేరకు ఆర్డీవో భూమి సర్వే దగ్గరుండి చేయించారు. కెనాల్​ చుట్టూ ఉన్న ప్రైవేటు భూ యజమానులను పిలిపించి వారి డాక్యుమెంట్స్​ పరిశీలించారు. అసిస్టెంట్​ డైరెక్టర్​ సర్వే ల్యాండ్​ రికార్స్​ అశోక్​, ఇరిగేషన్​ డీఈ కృష్ణమూర్తి, ఈఈ రామారావు, తహసీల్దార్​ సత్యనారాయణగౌడ్​ తదితరులు ఉన్నారు.