
- పాక్తో సంబంధాలపై ప్రశ్నించిన అస్సాం సీఎం
- దీటుగా ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్ ఎంపీ
గువహటి: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్మధ్య ఆదివారం ఎక్స్ వేదికగా మాటల యుద్ధ నడించింది. ప్రతిపక్ష నాయకుడైన గొగోయ్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయని సీఎం హిమంత విమర్శలకు దిగారు. అదేస్థాయిలో గొగోయ్ కూడా కౌంటర్ ఇచ్చారు. మొదట గొగోయ్ కి హిమంత బిశ్వ శర్మ 3 ప్రశ్నలు సంధించారు. ‘‘గొగోయ్ 15 రోజుల పాటు పాకిస్తాన్లో ఉన్నారా? ఉంటే, ఆ సందర్శన ఉద్దేశం ఏమిటి? గొగోయ్ భార్య పాకిస్తాన్కు చెందిన ఓ ఎన్జీవోనుంచి జీతం తీసుకుంటున్నారా? గొగోయ్ భార్యకు పాకిస్తాన్లో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు.
అలాగే, గొగోయ్ భార్య, పిల్లలు ఏ దేశ పౌరసత్వం కలిగి ఉన్నారు? అని అడిగారు. దీనికి గొగోయ్కౌంటర్ ఇచ్చారు. ‘‘శర్మ తన ఆరోపణలను రుజువు చేయలేకపోతే రాజీనామా చేస్తారా? శర్మ తన భార్య, పిల్లల గురించి ప్రశ్నలకు సమాధానం ఇస్తారా? అస్సాంలోని కోల్ మాఫియాతో సంబంధాలున్న వారిని రాష్ట్ర పోలీసులు అరెస్టు చేస్తారా?” అని ప్రశ్నించారు. సిట్ నివేదక కోసం వేచిచూస్తున్నానని అన్నారు. గొగోయ్ ప్రశ్నలకు కౌంటర్గా హిమంత మళ్లీ పోస్ట్ పెట్టారు. ‘నేను, నా భార్య, పిల్లలు ఎప్పుడూ పాకిస్తాన్లో పర్యటించలేదు. మా ఇంట్లో ఎవరికీ పాకిస్తాన్ నుంచి శాలరీ అందడంలేదు. పాకిస్తాన్తో సంబంధాలు ఉన్న వారి వివరాలను త్వరలోనే బయటపెడ్తం” అని అన్నారు.