
బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మేజర్పంచాయతీ పశువుల సంత వేలంపాట బుధవారం జరిగింది. ఏడాదిపాటు పశువుల సంతలో క్రయ, విక్రయాలు, రహదారి నిర్వహణకు వేలంపాట నిర్వహించారు. బచ్చన్నపేట పట్టణానికి చెందిన మంచాల వినయ్ రూ. 5.18 లక్షలకు దక్కించుకున్నారు.
తైబజార్ వేలంపాట సంతలో కూరగాయల దుకాణాల వద్ద రుసుము వసూలు చేయడం రూ. 2. 55 లక్షలకు దేవిని నగేశ్ దక్కించుకున్నాడు. పశువుల సంతలో పశువులను వాహనాల్లోకి ఎక్కిండం (డక్కా) వేలం పాటకు రూ. 27 వేలకు మంచాల వివేక్ దక్కించుకున్నాడు. గతంలో లాగా పలుమార్లు వాయిదా పడకుండా ఒకే రోజు వేలంపాట ముగియడంతో పంచాయతీ ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు.