- ఓయూలో పోస్టర్ రిలీజ్
ఓయూ, వెలుగు: పెండింగ్ఫీజు బకాయిలు విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్చేస్తూ ఈ నెల 30న ఇందిరా పార్కు వద్ద బీసీ విద్యార్థుల శంఖారావం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ పోస్టర్ను బీసీ విద్యార్థి నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమర శంఖారావానికి 33 జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్అందక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమై, కులవృత్తులు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ఖాజానాతో కొంతమంది కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారే తప్ప పేదల విద్యకు కేటాయించడం లేదన్నారు.