![Bellamkonda Sai Sreenivas: తమిళ్ బ్లాక్ బస్టర్ గరుడన్ రీమేక్లో బెల్లంకొండ హీరో!..డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆగలేరు!!](https://static.v6velugu.com/uploads/2024/07/bellamkonda-sai-sreenivas-will-act-in-the-garudan-telugu-remake-directed-by-vijay-kanakamedala_nTBS298Mao.jpg)
టాలీవుడ్లో ఫేమస్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas). తనదైన యాక్షన్, కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్షన్లో టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. టైసన్ నాయుడు నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అలాగే చావుకబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో శ్రీనివాస్ మరో మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు జూలై 1 నుంచి ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది. అంతేకాదు..బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ వినిపిస్తోంది.
రీసెంట్ తమిళ ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ‘గరుడన్’ రీమేక్లో బెల్లంకొండ హీరో నటించనున్నారట. ఇప్పటికే, ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని అల్లరి నరేష్ నాంది చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ కనకమేడల(Vijaykanakamedala)డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.నాంది సినిమాతో విభిన్నమైన డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల నుంచి సినిమా వస్తుండటంతో ఈ స్థాయిలో ఉండనుందో ఊహించుకోవొచ్చు.
ఇప్పటికే, బెల్లంకొండ కెరీర్ లో చెప్పుకోదగిన చిత్రాల్లో తమిళ్ రీమేక్ మూవీ రాక్షసుడు ఉండటం విశేషం.ఇక ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ తమిళ్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతుండటంతో బెల్లంకొండ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గరుడన్ మూవీ విషయానికి వస్తే..
విడుదల ఫేమ్ సూరి, M శశికుమార్ మరియు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. మే 31, 2024న విడుదలైనప్పటి నుండి ఈ మూవీ ప్రశంసలు అందుకుంటూ వస్తోంది. మొదట్లో తక్కువగా అంచనా వేయబడిన ఈ చిత్రం అంచనాలను అధిగమించి..2024లో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కథను అందించగా..ఆర్ఎస్ దురై సెంథిల్కుమార్ దర్శకత్వం వహించాడు.