ట్రాఫిక్​రూల్స్​ ప్రతి ఒక్కరూ పాటించాలి

ట్రాఫిక్​రూల్స్​ ప్రతి ఒక్కరూ పాటించాలి

జనగామ/ భూపాలపల్లి రూరల్​/ నెక్కొండ, వెలుగు: ట్రాఫిక్​ రూల్స్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారి జీవీ శ్రీనివాస్​ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుంచి కలెక్టరేట్​వరకు బైక్​ ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు. 

జయశంకర్​ భూపాలపల్లి పట్టణంలో ట్రాన్స్​పోర్ట్, పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో​కలెక్టరేట్​ నుంచి అంబేద్కర్​ సెంటర్​ వరకు బైక్​ ర్యాలీ నిర్వహించగా, కలెక్టర్​ రాహుల్​ శర్మ, ఎస్పీ కిరణ్​ కరే పాల్గొన్నారు. వరంగల్​ జిల్లా నెక్కొండ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ కిరణ్​ కుమార్​ పాల్గొని డ్రైవర్లకు డ్రైవర్లకు అవగాహన కల్పించారు.