
- బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుని బలమైన శక్తిగా ఎదిగిందని ఆ పార్టీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరిలోను కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సీఎం రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనూ కాంగ్రెస్ ను ఓడించారని, ఆ పార్టీ గెలిచిన 8 స్థానాల్లోను రేవంత్ రెడ్డి పాత్ర నామమాత్రమేని విమర్శించారు.
గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా దుర్భాషలడటం మానుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాలు, విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.