
బోధన్,వెలుగు : బోధన్ మండలంలోని ఊట్ పల్లి, అమ్దాపూర్ శివారులోని డీ-40 కెనాల్ కింద ఉన్న వరిపంటను బీజేపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీ-40కెనాల్ ద్వారా నిజాంసాగర్ నీరు వదిలి 12రోజులైన పొలాలకు నీరు అందలేదన్నారు. వరి పంటలు పొట్టదశలో ఉన్నాయన్నారు.
బోరుబావులు ఉన్న రైతులకు ప్రతినెలా రూ. 5 వేలు ఇచ్చి సాగునీరు తీసుకుంటున్నారన్నారు. ఇరిగేషన్ అధికారులకు అడిగితే హోలీ పండుగ తర్వాత సాగునీరు వదులుతామని చెబుతున్నారని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన ఇరిగేషన్ అధికారులు స్పందించి సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.