
ఆర్మూర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని దేశ పౌరులందరూ చూడాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్లో ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి నివాసంలో మన్ కి బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని గంగారెడ్డి చెప్పారు.
ప్రధాని మోదీ దేశంలో జరుగుతున్న ఎన్నో విషయాలను ఈ కార్యక్రమాలతో ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు, సీనియర్ నాయకులు పుప్పాల శివరాజ్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, మందుల పోశెట్టి, పోల్కం వేణు, ద్యాగ ఉదయ్, సూరత్ శ్రీకాంత్, గుగులోత్ తిరుపతి నాయక్, కలిగోట్ ప్రశాంత్, ప్రసన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.