
మిడ్జిల్, వెలుగు: పేదల ఆరోగ్య ఖర్చుల కోసం ప్రభుత్వం ఇస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులను బోయిన్పల్లి కాంగ్రెస్ నాయకులు అందజేశారు. మిడ్జిల్ మండలంలోని బోయిన్ పల్లి గ్రామానికి చెందిన సువర్ణ, రఘుమాల్ రెడ్డి, బోయ మంజుల సత్యనారాయణలకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు.
కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బంగారయ్య, మాజీ డిప్యూటీ సర్పంచ్ బంగారు, గ్రామ యువజన అధ్యక్షుడు నాగశేషు, సీనియర్ నాయకులు మైముద్, యువజన కాంగ్రెస్ నాయకులు పిట్టల వెంకటేశ్, రాజు నాయక్, హరికృష్ణ, శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.