ఈ నెల 8లోపు మహిళలకు రూ.2,500 ఇవ్వాలి : కవిత

ఈ నెల 8లోపు మహిళలకు రూ.2,500 ఇవ్వాలి  : కవిత
  • లేదంటే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపుతం : కవిత

హైదరాబాద్, వెలుగు: మహిళా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవిత డిమాండ్​ చేశారు. మహిళలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్​ సర్కారును మట్టికరిపిస్తామని ఆమె హెచ్చరించారు. వరంగల్​లో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయాని కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలన్నారు.

 సోమ వారం ఆమె తన నివాసంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించి.. సీఎం రేవంత్​ రెడ్డికి పది వేల పోస్టు కార్డులను పంపించారు. మార్చి 8 నాటికి సీఎం రేవంత్ స్పష్టమైన ప్రకటన చేయ కపోతే.. 10 వేల మంది మహిళలం 10 వేల గ్రామాలకు వెళ్తామని, అన్ని గ్రామాల్లోని మహిళలను కూడగట్టి సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపిస్తామని పేర్కొన్నారు.