
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో త్వరలో ప్రారంభం కానున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఏప్రిల్ 2, 3, 4 తేదీలలో విగ్రహ ప్రతిస్థాపన జరగనుండగా, గౌడ సంఘం నాయకులు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానపత్రికను అందజేశారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి పాల్గొని పూజలు చేశారు. ఎన్టీపీసీలో ఐఎన్టీయూసీ లీడర్బాబర్ సలీంపాషను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో గౌడ సంఘం లీడర్లు మెరుగు హనుమంతుగౌడ్, బాలసాని స్వామిగౌడ్, లక్ష్మిపతిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, నాగభూషణం గౌడ్, ఆంజనేయులు గౌడ్, గోవర్ధన్రెడ్డి, కోటేశ్వర్లు, మధు, తదితరులు పాల్గొన్నారు.
రంజాన్విందులో వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్కాంగ్రెస్ లీడర్ సయ్యద్ సజ్జాద్ స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన రంజాన్విందులో చెన్నూర్ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండారి సునీల్, బాలసాని సతీశ్, గంగుల సంతోష్, ప్రశాంత్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.