ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జూలై 7న జరిగిన ఈ ప్రమాదంలో దెబ్బతిన్న బోగీలను అధికారులు పరిశీలించారు. బీబీనగర్ వద్ద ఉన్న బోగీలను పరిశీలించిన 12 మంది క్లూస్ టీం అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును తనిఖీలు చేస్తున్నారు అధికారులు.
జులై 7న హౌరా – సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ప్రెస్రైలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి బొమ్మాయి పల్లి దగ్గరకు రాగానే బోగీల్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 7 బోగీలు కాలి బూడిదయ్యాయి. పక్క బోగీలకు మంటలు వ్యాపిస్తుండటంతో అధికారులు ట్రైన్ లింక్ తొలగించారు. ప్రయాణికులు అప్రమత్తం అయి చైన్ లాగడంతో పెను ప్రమాదం తప్పింది.