సీఎంను కలిసిన ట్రస్మా ప్రతినిధులు

సీఎంను కలిసిన ట్రస్మా ప్రతినిధులు

బోధన్, వెలుగు :  నిజామాబాద్​ జిల్లా ట్రాస్మా అధ్యక్షుడు కొడాలి కిషోర్ , ప్రతినిధులు రాజు, హరి బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డితో కలిసి సీఎం రేవంత్​ రెడ్డిని కలిశారు. పెండింగ్​లో ఉన్న బకాయి స్కాలర్​ షిప్​​లను విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల స్కాలర్ షిప్​లు రాక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. స్పందించిన సీఎం త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.