సెక్రటేరియట్ ముందు.. రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

సెక్రటేరియట్ ముందు.. రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

హైదరాబాద్ లోని  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ ముందు రాజీవ్​ గాంధీ విగ్రహాన్ని  ఆవిష్కరించారు  సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కూమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

ఆగస్ట్   20న రాజీవ్​ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం భావించింది. కానీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. స‌‌‌‌‌‌‌‌చివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం భావించింది. అయితే, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సెక్రటేరియెట్​బయట కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. 

ALSO READ | Good News : అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ

సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఇటీవలి భూమి పూజ కూడా చేశారు. డిసెంబర్​ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఒకవైపు దేశానికి ప్రధానులుగా పనిచేసిన  ఇందిరా గాంధీ, పీవీ విగ్రహాలు వరుసగా ఉండటంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అటు అమరవీరుల చిహ్నం, సెక్రటేరియెట్ మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.