
కొడంగల్, వెలుగు: సన్న వడ్లకు రూ.500 బోనస్ఇస్తూ సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి అన్నారు. ఆదివారం కొడంగల్, పెద్దనందిగామాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దళారుల చేతిలో రైతు నష్టపోకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వికారాబాద్జిల్లా లైబ్రరీ చెర్మెన్రాజేశ్రెడ్డి, నేతలు శివకుమార్, ప్రశాంత్, సంజీవ్రెడ్డి ఉన్నారు.