
మనోహరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ల్యాండ్అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ రాజ్, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిద్దిపేట సీపీ అనురాధ, ఎస్పీ ఉదయ్ కుమార్, అడిషనల్కలెక్టర్ నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎలక్షన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సీఎంకు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.