
కామారెడ్డిటౌన్, వెలుగు : గోరు బోలి ( లంబాడా) భాషను రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్లో చేర్చేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినందున కామారెడ్డిలో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.
సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్ రాథోడ్ మాట్లాడుతూ లంబాడీ భాషాభిమానులకు గొప్ప వరమన్నారు. బంజరా సేవా సంఘం ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ సేనావత్ మోతిరాం, ప్రతినిధులు ఆనంద్, వినోద్, శ్రీనునాయక్, సదర్, మోహన్నాయక్, రాధక్రిష్ణ, శంకర్ పాల్గొన్నారు.