
- కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ , వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. గురువారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. రోజూ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్న మహిళలు క్రీడల్లోనూ ప్రతిభ చూపారన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మాచారి, టీజీవో జిల్లా అధ్యక్షుడు మమ్మద్ రఫీ, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ధనమ్మ, నాయకులు కొప్పు ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్, పి . రాజేంద్రప్రసాద్, క్రీడా విజేతలు నీలోఫర్, స్వరూప, సుస్మిత, అనిత, సరిత, తబాష్మ, కళ్యాణి, ప్రసన్న, అలివేలు, సంధ్యారాణి, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.