సీఎంఆర్​ ఇవ్వని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలి

సీఎంఆర్​ ఇవ్వని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలి

కామారెడ్డి​, వెలుగు : కస్టమ్స్ మిల్లింగ్​ రైస్​ ( సీఎంఆర్​) నిర్ధేశిత గడువులోగా సప్లయ్​ చేయని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని సివిల్​ సప్లయ్​ అధికారులకు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం  తన చాంబర్​లో సీఎంఆర్​పై  అధికారులతో నిర్వహించిన  రివ్యూలో కలెక్టర్​ మాట్లాడారు. సీఎంఆర్​ సేకరణ స్పీడప్ కావాలన్నారు.   2023–24 యాసంగి,  2024–25వానకాలం సీజన్​కు  సంబంధించిన  సీఎంఆర్​ సేకరణపై అధికారులు మిల్లులను తనిఖీ చేయాలన్నారు.

సీఎంఆర్​ కంప్లీట్ చేయని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.  2023–24 యాసంగి సీజన్​కు సంబంధించి 54 శాతం  కంప్లీట్​ అయ్యిందని, ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలన్నారు.  రాష్ర్ట ప్రభుత్వ అగ్రీమెంట్​ ప్రకారం ఫిలిప్పీన్స్​ దేశానికి ఎగుమతి చేసే  బియ్యానికి సంబంధించి జిల్లాకు  3వేల టన్నులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్​ విక్టర్​,  డీఎస్​వో మల్లికార్జునబాబు, సివిల్​ సప్లయ్​ డీఎం రాజేంధర్​,  మార్కెటింగ్ ఆఫీసర్​ రమ్య తదితరులు పాల్గొన్నారు.