
లింగంపేట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం మండలంలోని ముస్తాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. గ్రామంలో149 మంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులు ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు.
రేషన్కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేసి కార్డులను అందజేయాలని సూచించారు. అనంతరం గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో పీడీ సురేందర్, డీఎస్వో మల్లికార్జున్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేందర్, ఎల్లారెడ్డి , ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేష్ ఎంపీవో మలహరి, పంచాయతీ సెక్రటరీ శ్రావణ్కుమార్ ఉన్నారు.