ఎమ్మెల్సీ పోలింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు

ఎమ్మెల్సీ పోలింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు
  • కలెక్టర్ రాజీవ్​గాంధీ

నిజామాబాద్, వెలుగు : ఈనెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​కు జిల్లాలో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మండల ఆఫీసర్లు మరోసారి పోలింగ్ సెంటర్లు విజిట్ చేసి లోపాలు ఉంటే సరిచేయాలన్నారు. శుక్రవారం తన ఛాంబర్​లో ఆయా శాఖల అధికారులతో ఆయన మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. షామియానాలు, తాగునీరు, వీల్​చైర్​తోపాటు మెడికల్ స్టాఫ్​ ప్రతి సెంటర్​లో ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లపై పొలిటికల్ పార్టీ లీడర్లకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

పోలింగ్​తర్వాత సెక్టోరియల్ ఆఫీసర్ పర్యవేక్షణలో పూర్తి సెక్యూరిటీ మధ్య బ్యాలెట్​బాక్స్​లను కరీంనగర్ కౌంటింగ్ సెంటర్​కు తరలించాలని తెలిపారు. బ్యాలెట్ సేఫ్టీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేంద్రకుమార్, అడిషనల్ డీసీపీ రాంచంద్రారావు, ఏసీపీ రాజావెంకట్​రెడ్డి, నాగూరావు తదితరులు పాల్గొన్నారు. 

యూఎన్​వో ప్రొగ్రాంకు పూర్తి సహకారం..

ఉపాధి కోసం గల్ఫ్ వలసబాట పట్టి మరింత చితికిపోతున్న కుటుంబాలను ఆదుకోడానికి ఐక్యరాజ్యసమితి (యూఎన్​వో) జిల్లాలో చేపట్టే ప్రతి ప్రోగ్రామ్​కు సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్ జిల్లాను యూఎన్​వో మైగ్రేషన్​మల్టీ ఫార్టునర్​ఫండ్ (ఎంఎంటీఎఫ్​) కోసం పైలెట్ ప్రాజెక్ట్​కింద ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం యూఎన్​వో ప్రతినిధి డాక్టర్ లిస్సీ జోసెఫ్ తో​నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. జిల్లాలో గల్ఫ్​ వలసలు, వారి కుటుంబాల జీవన స్థితిగతులపై కలెక్టర్​ ఆమెకు వివరించారు.