టెన్త్​ రిజల్ట్​పై ఫోకస్​ పెట్టాలి : రాజీవ్​గాంధీ

 టెన్త్​ రిజల్ట్​పై ఫోకస్​ పెట్టాలి : రాజీవ్​గాంధీ
  • కలెక్టర్​ రాజీవ్​గాంధీ 

నిజామాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో మౌలిక వసతులు పెంచామని, డీఎస్సీ ద్వారా నియమకాలు జరిగినందున టెన్త్​ రిజల్ట్​పై టీచర్లంతా ఫోకస్​పెట్టాలని కలెక్టర్​రాజీవ్​గాంధీ హనుమంతు సూచించారు. బార్డర్​మార్కులతో స్టూడెంట్స్​పాస్​ అయితే ఉన్నత విద్యలో వెనుకబడతారన్నారు. శుక్రవారం ఆయన తన ఆఫీస్​లో జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల హెచ్​ఎంలతో మీటింగ్​ నిర్వహించారు. స్కూల్స్​విజిట్ చేసినప్పుడు స్టూడెంట్స్​సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నం చేయగా  సంతృప్తికర సమాధానాలు రాలేదన్నారు.

ప్రైమరీ లెవల్​ నుంచి మెరుగైన విద్యను అందిస్తే సమర్థులుగా తయారవుతారన్నారు. టెన్త్​ ఫైనల్​ఎగ్జామ్స్​కు టైం దగ్గరపడుతున్నందున మరింత ప్లాన్​తో సిలబస్​ పూర్తి చేసి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని కోరారు. స్టూడెంట్స్​లో పోటీతత్వాన్ని పెంచాలన్నారు. అపార్​ నమోదులో ముందంజలో ఉన్న హెచ్​ఎంలను, ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న కాంప్లెక్స్​ టీచర్లను ఆయన సన్మానించారు. అడిషనల్​కలెక్టర్​కిరణ్​కుమార్, డీఈవో అశోక్​, ఎగ్జామ్స్​కంట్రోల్​ఆఫీసర్​ విజయభాస్కర్, ఎంఈవోలు అటెండయ్యారు.

ఎన్నికల రూల్స్​ పాటించాలి..

బాల్కొండ : ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు పక్కాగా అమలుచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం భీంగల్, వేల్పూర్ మండలాల్లో పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి, గ్రాడ్యుయేట్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ర్యాంప్ టాయిలెట్స్, విద్యుత్ సరఫరా,నీటి వసతి పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 

ఓటర్ల సంఖ్య కనుగుణంగా పట్టభద్రులు,టీచర్ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్​లో సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలని సూచించారు. అనంతరం  భీంగల్, వేల్పూర్ మండల కేంద్రాల్లో స్కూళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. బియ్యం, కూరగాయలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్​లో పంపిణీ చేసిన దుప్పట్లు, కాస్మోటిక్ కిట్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, మండల స్థాయి ఆఫీసర్లు పాల్గొన్నారు.