
- కలెక్టర్ రాజీవ్గాంధీ
నిజామాబాద్, వెలుగు : వచ్చే నెల వరకు జరిగే ఎర్ర, తెల్ల జొన్న, పసుపు అమ్మకాలను అగ్రికల్చర్, హార్టికల్చర్ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రజొన్న కొనుగోళ్ల విషయంలో సీడ్ కంపెనీ ఓనర్లు రైతులతో చేసుకున్న బైబ్యాక్ అగ్రిమెంట్కు కచ్చితంగా కట్టుబడాలని, మార్కెట్ రేట్కు తగ్గకుండా తెల్ల జొన్నలకు ధర ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు.
అధిక రేట్లభించే చోటకు రైతులు వెళ్లాలనుకుంటే ఆపోద్దన్నారు. మోసానికి పాల్పడే వ్యాపారులు ఎంతటివారైనా ఊరుకోమని హెచ్చరించారు. పసుపు అమ్మకాల విషయంలో కూడా రైతుల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇందూర్ మార్కెట్ గంజ్లో కమీషన్దారుల రోల్లేని డైరెక్ట్ పర్చేస్ సెంటర్ఓపెన్ చేయించామనితెలిపారు. రైతులు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు.
తేమ లేకుండా పసుపును బాగా ఆరబెట్టి మార్కెట్కు తెస్తే మంచి ధర లభిస్తుందన్నారు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వాజీద్ హుస్సేన్, హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, ఏడీఏ, ఏవో, పసుపు ట్రేడర్లు , సీడ్ కంపెనీ ఓనర్లు ఉన్నారు.
హాస్టల్లో రాత్రి కలెక్టర్ బస..
ఎడపల్లి/ నిజామాబాద్, వెలుగు : ఎడపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు బస చేశారు. డిన్నర్ టైంకు చేరుకొని భోజనం నాణ్యతను పరిశీలించారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న రూమ్స్విజిట్చేసి టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్తో భేటీ అయ్యారు. పలు సబ్జెక్ట్స్ పై విద్యార్థులకు ప్రశ్నలు వేసి అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించారు. స్టోర్రూమ్, డార్మెటరీ, కిచెన్ను పరిశీలించి స్టూడెంట్స్తో కలిసి హాస్టల్లో నిద్రించారు. ఆయన వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ప్రిన్సిపాల్ జైపాల్ తదితరులు ఉన్నారు.