
- కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్వందశాతం వసూలు చేయాలని కలెక్టర్రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. బుధవారం మున్సిపల్అధికారులతో జూమ్ మీటింగ్నిర్వహించారు. ట్యాక్స్టార్గెట్ ఎంత, వసూలు చేసిందెంత.. ఎంత మందికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. పన్ను చెల్లించనివారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. రేపటి నుంచి పురోగతి కనిపించాలని, గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
ఇంటర్ ఎగ్జామ్ సెంటర్తనిఖీ
జనగామ సోషల్వెల్ఫేర్కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ ను కలెక్టర్రిజ్వాన్బాషా షేక్తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పించిన సదుపాయాలపై ఆరా తీశారు.
కేజీబీవీలకు ఇన్సినరేటర్లు అందజేతజిల్లాలోని కేజీబీవీలకు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్చొరవతో బుధవారం ఇన్సినరేటర్లు అందజేశారు. ఒక్కోదాని విలువ రూ. 21 వేలు కాగా, రోజుకు 100 నాప్కిన్స్ను కాల్చివేస్తాయి.