
నందిపేట, వెలుగు : ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో మూడు బిల్లులు ఆమోదం పొందడంపై బుధవారం నందిపేట, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. బీసీ కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ, రాజీవ్ యువశక్తి ద్వారా నిరుద్యోగులకు రుణాల వంటి మూడు బిల్లులు శాసనసభలో ఆమోదం పొందాయి. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నందిపేట, డొంకేశ్వర్ మండలాల అధ్యక్షులు మంద మహిపాల్, భూమేస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. .
ఆర్మూర్లో..
ఆర్మూర్ : అసెంబ్లీలో మూడు బిల్లుల ఆమోదంపై ఆర్మూర్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా గౌడ్, అయ్యప్ప శ్రీనివాస్, ఖాందేశ్ శ్రీనివాస్, మోత్కూరి లింగా గౌడ్, జిమ్మి రవి, అజ్జు, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ విజయ అగర్వాల్, అల్జాపూర్ కిరణ్ కుమార్, శీను తదితరులు పాల్గొన్నారు.