
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ చామల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఇటీవల దుబాయ్లో సినీ నిర్మాత కేదార్ అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ చామ ల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే హరీశ్ రావు దుబాయ్కి పోయిన విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో పెండ్లికి వెళ్లానని బుకాయిస్తున్న హరీశ్.. ఈ నెల 6న పెండ్లి ఉంటే గత నెల 22నే దుబాయ్ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో లూటీ చేసిన పైసలను దుబాయ్లో దాచుకోవడానికే వెళ్లారని, అదే రోజున దుబాయ్ లో కేదార్ చనిపోయారని ఆరోపించారు. ఎలక్షన్ లు, కలెక్షన్ లు హరీశ్ నినాదమని చామల అన్నారు.