తెలంగాణలో 10 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో 10 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా  వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా 10,122 కేసులు నిర్ధారణ అయ్యాయని  రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. మరోవైపు మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. నిన్న(సోమవారం) ఒక్క రోజే కొవిడ్‌తో చికిత్స పొందుతూ 52 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2094కి చేరింది. లేటెస్టుగా 6,446 మంది  కరోనానుంచి కోలుకున్నారు.ఇప్పటి వరకూ వైరస్ నుంచి బయట పడిన వారి సంఖ్య 3,40,590గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,221 ఆక్టివ్  కేసులు ఉన్నాయి.  GHMC పరిధిలో 1,440 కేసులు నమోదయ్యాయి.