ఎల్ఆర్ఎస్​ రూల్స్​​ సవరణ : సీఎస్​ శాంతి కుమారి

ఎల్ఆర్ఎస్​ రూల్స్​​ సవరణ : సీఎస్​ శాంతి కుమారి
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్​ శాంతి కుమారి 

హైదరాబాద్, వెలుగు : అనుమతి లేని అక్రమ లే అవుట్ల రెగ్యులరైజేషన్​ –2020 (ఎల్ఆర్ఎస్) రూల్స్​ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లేఅవుట్‌‌‌‌లో 10 శాతం ప్లాట్లు సేల్​ డీడ్​ రిజిస్ట్రేషన్లు అయి.. మిగిలిన 90 శాతానికి ​ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతోపాటు రిజిస్ట్రేషన్‌‌‌‌కు అవకాశం కల్పించారు. కచ్చితంగా 2020 ఆగస్టు 26 కంటే ముందు కనీసం 10 శాతం ప్లాట్లు అమ్మి ఉండాలని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్​ ఫీజును సబ్​ రిజిస్ట్రార్​​ కార్యాలయాల్లో చెల్లించేలా మార్పులు చేశారు.