ఏడుగురు ఇన్​స్పెక్టర్లు, 20 మంది ఎస్సైలు బదిలీ

ఏడుగురు ఇన్​స్పెక్టర్లు, 20 మంది ఎస్సైలు బదిలీ

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలోని 20 మంది ఎస్సైలను, 7 మంది ఇన్​స్పెక్టర్లను సీపీ అవినాష్​మహంతి బుధవారం బదిలీ చేశారు. మరో ఇద్దరు ఇన్​స్పెక్టర్లు వెంటనే మల్టీజోన్–2 ఐజీ ఎదుట రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​గా ఉన్న రాజశేఖర్​రెడ్డిని కేపీహెచ్​బీ పీఎస్​కు, గచ్చిబౌలి డీఐగా ఉన్న రాజేశ్​ను కూకట్​పల్లి ఇన్​స్పెక్టర్​గా, రాజేంద్రనగర్​జోన్​ఎస్​బీ ఇన్​స్పెక్టర్​గా ఉన్న సురేశ్​ను గచ్చిబౌలి ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​గా బదిలీ చేశారు. 

అలాగే కూకట్​పల్లి ఇన్​స్పెక్టర్​గా ఉన్న కొత్తపల్లి ముత్తును రాజేంద్రనగర్ జోన్​ఎస్​బీ ఇన్​స్పెక్టర్​గా, కేపీహెచ్​బీ ఇన్​స్పెక్టర్​గా ఉన్న వెంకటేశ్వరరావును సైబరాబాద్​సీటీసీకి ట్రాన్స్​ఫర్​చేశారు. సీటీసీ ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్న కె.భాస్కర్​, బాలానగర్​ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్​ఎన్.సురేశ్​ను హైదరాబాద్​మల్టీజోన్–2కు ట్రాన్స్​ఫర్ అయ్యారు. మల్టీజోన్​2కు ట్రాన్స్​ఫర్​ అయిన ఇద్దరు ఇన్​స్పెక్టర్లు ఐజీకి రిపోర్టు చేయాలని సీపీ స్పష్టం చేశారు. అలాగే ట్రాఫిక్, లా అండ్​ఆర్డర్, సీసీఎస్​ పోలీస్​ స్టేషన్ల పనిచేస్తున్న 20 మంది ఎస్సైలు ట్రాన్స్​ఫర్​అయ్యారు.