వివాదాస్పదంగా వనపర్తి డీసీసీబీ షాపింగ్​ కాంప్లెక్స్

వివాదాస్పదంగా వనపర్తి డీసీసీబీ షాపింగ్​ కాంప్లెక్స్
  • ​రెండేండ్లుగా కిరాయి లేదు
  • ఖాళీ చేయని దుకాణాదారులు
  • గోడలకు రంధ్రాలు చేస్తున్న డీసీసీబీ అధికారులు
  • పోలీస్ ​స్టేషన్​లో కేసు నమోదు

వనపర్తి, వెలుగు: వనపర్తి డిస్ర్టిక్ట్​ కో -ఆపరేటివ్​సెంట్రల్​బ్యాంక్ బ్రాంచ్ బిల్డింగ్ లోని షాపింగ్​కాంప్లెక్స్​వ్యవహారం వివాదాస్పదమవుతోంది. డీసీసీబీ భవనంలో షాపింగ్ కాంప్లెక్స్​ నిర్మించడమే రూల్స్​కి విరుద్ధంగా కాంప్లెక్స్ కట్టి, ఏండ్లుగా కిరాయి  వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆందోళనలు చేశారు. దీనిపై  స్పందించిన డీసీసీబీ అధికారులు షాపింగ్​కాంప్లెక్స్​లోని దుకాణాదారులకు వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చారు.  దుకాణాదారులు ఖాళీ చేయకపోతుండడంతో  పాటు రెండేండ్లుగా అద్దె కూడా చెల్లించడంలేదు. 

కొద్దిరోజుల కింద డీసీసీబీ ఆఫీసర్లు దుకాణాలకు కరెంటు కట్​ చేయగా.. కోర్టు ఆర్డర్ తెచ్చుకుని పునరుద్ధరించుకున్నారు. ఎంతకూ షాపులను ఖాళీ చేయకపోవడంతో దుకాణాల ముందు పెద్ద మట్టి కుప్పలను పోశారు. షాపుల వెనుక భాగంలోని గోడలకు రంధ్రాలు చేశారు. దీంతో ఆందోళన చెందిన దుకాణాదారులు డీసీసీబీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కమర్షియల్​ అనేదే ఉండరాదు

డీసీసీబీ భవనంలో ఎలాంటి కమర్షియల్​ నిర్మాణాలు చేయరాదని కో- ఆపరేటివ్​ అధికారులు చెబుతున్నారు. కానీ వనపర్తి బ్రాంచ్ భవనంలో 20ఏండ్ల కింద షాపింగ్​కాంప్లెక్స్​ నిర్మించారు. పది షాపుల కిరాయిని డీసీసీబీ బ్యాంకులో జమచేయకుండా కొందరు విండో ప్రతినిధులు తమ  సొంత ఖాతాల్లో కిరాయి వేయించుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు ప్రశ్నించినప్పుడు అభివృద్ధి కోసమే వేయించుకున్నామని చెప్పారు.  డీసీసీబీ బిల్డింగ్ లో షాపిం గ్​ కాంప్లెక్స్​ కాకుండా బ్యాంకుకు వచ్చే రైతుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా అలాంటివేవీ అక్కడ లేకపోవడం గమనార్హం.