
చేర్యాల,వెలుగు: చేర్యాల కేంద్రంలో ఏర్పాటు కానున్న జిల్లా సివిల్ జడ్జ్ కోర్టు పనులను జిల్లా కలెక్టర్ మను చౌదరీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. సాయి రమాదేవీ బుధవారం పరిశీలించారు. ఈ నెల 11న ప్రారంభం కానుందని తెలిపారు. కోర్టు ప్రారంభం అయ్యే సమయంలో పూర్తి సెక్యూరిటీ ని ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు.