
ములుగు, వెలుగు: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యసిబ్బందికి డీఎంహెచ్వో గోపాల్ రావు సూచించారు. ములుగు మండలం రాయిని గూడెం పీహెచ్సీ పరిధిలోని జగ్గన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి వంటశాల, భోజనం, స్టోర్ రూంలను పరిశీలించారు. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు.
విద్యార్థులకు వడదెబ్బపై అవగాహన కల్పించారు. అనంతరం పత్తిపల్లి ఆయుష్మాన్ఆరోగ్య మందిర్ను సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. వైద్యసిబ్బందితో మాట్లాడుతూ గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధిహామీ పథకాల ప్రాంతాలను గుర్తించి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎస్కే టీం డాక్టర్ శ్రీలత, డాక్టర్ మల్లికార్జున్, ఆరోగ్య కార్యకర్త ఉపేంద్ర, తిరుపతమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.