
సత్తుపల్లి, వెలుగు : మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం నుంచి 3 రోజుల పాటు బీటెక్ థర్డ్ ఇయర్ సీఎస్సీ విద్యార్థులకు వర్క్ షాప్ ప్రారంభించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ తెలిపారు. బ్రెనోవిజన్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై వర్క్షాప్ జరిగిందన్నారు. కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.వి.రామచంద్ర రావు, జాకీర్ హుస్సేన్, పీ.మారేశ్వర రావు, సిహెచ్ రాజా జాకోబ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.