
- ఎన్నికల అబ్జర్వర్ మహేశ్ దత్ ఎక్కా
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్మహేశ్ దత్ ఎక్కా అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఎన్నికల నోడల్, ఏఆర్ వో అధికారులతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు తారా డిగ్రీ కాలేజీలో పోలింగ్ కేంద్రాన్ని, అంబేద్కర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్ ను కలెక్టర్ క్రాంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల వివరాలను కలెక్టర్ క్రాంతిని అడిగి తెలుసుకున్నారు.
విధులకు హాజరు కాని ఉద్యోగులకు షో కాజ్ నోటీసులు జారీచేసి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి ఎన్నికలకు సంబంధించి మొదటి, రెండో రాండమైజేషన్ పూర్తి చేశామని, మూడో రాండమైజేషన్ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి, అడిషనల్ఎస్పీ సంజీవ్ రావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లాలోని నోడల్ అధికారులు, ఆర్ వోలు, తహసీల్దార్లు, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.