పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి

పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి
  •  అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు
  • సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను ఏకో టూరిజం  ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్​మోహన్​రావు సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు.  నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు వద్ద ఏకో టూరిజంతో అభివృద్ధి చేయవచ్చన్నారు. రిజర్వాయర్​కు సమీపంలో ని అభయారణ్యం, ఐలాండ్​ను టూరిజం అభివృద్ధి చేయాలన్నారు.   నాగిరెడ్డిపేట మండలంలో  పురాతన త్రిలింగేశ్వర టెంపుల్ ఉందని,  పక్కనే మంజీరా నది ప్రవహిస్తుందన్నారు.  

లింగంపేటలో నాగన్నబావి,  నియోజకవర్గంలో వీరన్నగుట్ట,  రామారెడ్డి మండలంలో కాలభైరవ స్వామి టెంపుల్​ను అభివృద్ధి చేయాలన్నారు. స్పందించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పోచారం రిజర్వాయర్​ను ఏకో టూరిజంగా, వాటర్ బేస్డ్​ రిక్రియేషన్ కేంద్రంగా  అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.   మెట్లబావిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.