
- దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ సిటీలోని క్రిస్టియన్ కాలనీ సీబీసీ చర్చి అభివృద్ధికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం సిటీలోని పుప్పాలగుట్ట మీద ఈస్టర్ను వరంగల్ క్రిస్టియన్ కాలనీ సీబీసీ చర్చి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
వేడుకల్లో పాల్గొన్నా మంత్రి మాట్లాడుతూ క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వస్కుల బాబు, ప్రవీణ్, పాస్టర్లు, ప్రముఖ స్పీకర్ బెంజమిన్ శాస్త్రి పలాధి, పుల్లా బాబుజగ్జీవన్, కార్తీక్ అబ్రహం, మాథ్యూస్, సంఘ పెద్దలు, క్రైస్తవులు హాజరయ్యారు.