మూన్యాతండా, భద్రుతండా గ్రామలలో .. చిరుత పులి సంచారం

మూన్యాతండా, భద్రుతండా గ్రామలలో .. చిరుత పులి సంచారం

జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు అటవీ రేంజ్, తల్లాడ అటవీ రేంజ్​ సరిహద్దు​ లోని మూన్యాతండా, భద్రుతండా గ్రామ పంటపొలాల్లో చిరుతపులి సంచరించినట్లు ఫారెస్ట్​ అధికారులు తెలిపారు.

 గ్రామస్తులు ఇచ్చిన సమాచారం తో సోమవారం పారెస్ట్​ అధికారులు  పరిశీలించి  అవి చిరుతపులి పాదముద్రలే అని గుర్తించారు. పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తంచేసి ,రాత్రి సమయాల్లో ప్రజలు, రైతులు ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, చిరుత పులి జాడ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎఫ్​ఆర్​ఓ ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.